చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేస్తే మంచిది

– ఇంటికోసం ప్రభుత్వాన్ని కోరితే పరిశీలిస్తాం
– వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
అమరావతి, ఆగస్టు17(జనంసాక్షి ) : వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉంటే.. వరద నా కొంప ముంచడానికే వస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. హై సెక్యురిటీ జోన్‌లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారని ప్రశ్నించారు. కృష్ణానదికి ఈ స్థాయిలో వరద రావడం చాలా అరుదున్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు వచ్చినంత కోపం కృష్ణా వరదలతో చంద్రబాబుకు వచ్చిందని అన్నారు. ఆయన నివాసం అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందే చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పని తెలిసికూడా మొండిగా అక్కడే వుంటున్నారని విమర్శించారు. వరదలతో చంద్రబాబు నివాసం మునిగిపోతే.. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టారని, ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని అన్నారు. నోటీస్‌ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని, తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదని అంబటి సూచించారు. తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారని, విూక్షేమం కోసం చెబుతున్నామని అంబటి అన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత ¬దాలో ప్రభుత్వ ఇళ్లు ఏర్పాటు కోసం చంద్రబాబు కోరితే పరిశీలిస్తామని అంబటి రాంబాబు అన్నారు.