చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో భారీ చేరికలు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 13 : పెద్దపల్లి జిల్లా మంథని పార్టీ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో మహాదేవ్ పూర్ మండలం కన్నెపల్లి, రామగిరి మండలం సింగిరెడ్డి పల్లి, మల్హర్ రావ్ మండలం రావుల పల్లి, కాటారం మండలం దామరా కుంట, మంథని మండలం మల్లారం గ్రామాలకు చెందిన సుమారు 300 మంది మహిళలు, యువత బీజేపీ పార్టీ లో చేరారు. వీరికి సునీల్ అన్న కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ… రోజు రోజు కు బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని, కాంగ్రెస్, బీ ఆర్ఎస్ పార్టీలకు మంథని ప్రాంతంలో మనుగడ లేదని, ఒక కొత్త నాయకుడిని, బిజెపి పార్టీని, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ చేరికలే నిదర్శనం అని అన్నారు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన చూసి ప్రజలు విసుగు చెందారని, అవినీతి అక్రమాలు, అసమర్ధ పాలనకు మంతిని ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మంథని అభివృద్ధిని కోరుకుందాం అని అన్నారు. అవినీతి అక్రమ ఆస్తుల సంపాదించుకొని మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి మద్యం డబ్బుతో ప్రజలను కొనాలని ఇద్దరు నాయకులు చూస్తున్నారని మీ ఓటుతో ఈసారి బుద్ధి చెప్పాలని, ఒకసారి మంతినిలో బిజెపికి అవకాశం ఇవ్వాలని నరేంద్ర మోడీ సంక్షేమ పాలనను అవినీతి రహిత పాలన మంథనిలో తీసుకు వద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.