చత్తీస్గఢ్లో మావోల ప్రతాపం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాంకేర్ జిల్లాలోని చార్గావ్ వద్ద నిక్కో ఐరన్ ఓర్ మైన్స్కు చెందిన 22 వాహనాలను తగులబెట్టారు. మైన్స్ కంపెనీ వద్ద పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా, రాజ్నంద్గావ్ జిల్లా సావర్గావ్ దగ్గర పోలీసు ఇన్ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరు గ్రామస్థులను గొంతు కోసి హత్య చేశారు.