చిన్నమ్మతో ‘రాములమ్మ’ భేటీ
చెన్నై, డిసెంబర్ 17: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నే హితురాలు, అన్నాడీఎంకే సీనియర్ నేత శశికళను శనివారం సినీనటి విజయశాంతి కలిశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్కు వెళ్లిన ఆమె శశికళతో సమావేశమయ్యారు. అంతకుముందుకు విజయశాంతి మెరీనాబీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని దర్శించుకొని అంజలి ఘటించారు. జయలలిత మృతి తీరనిలోటన్నారు.