చిన్నారుల కుటుంబ సభ్యులకు ఆర్దిక సహాయం అందజేత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి): యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో ఈత సరదాతో చెరువులో పడి నలుగురు చిన్నారులు చనిపోయిన సంగతి విధితమే చిన్నారుల కుటుంబ సభ్యులకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరారం వెంకట్ రెడ్డి 10వేల రూపాయల  ఆర్థిక సహాయం ను చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం తీవ్రంగా బాధిం చిందని అభం శుభం తెలియని చిన్నారులు అర్థం తరంగా చనిపోవడం ఆ కుటుంబ సభ్యులకు తీరని లోటని ఆ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఇలాంటి సంఘటనలు జరగకుండా మండలం లోని గ్రామాలలోని చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు పాతాలని చిన్నారుల  కుటుంబ సబ్యులకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు తల్లిదండ్రులు  చిన్నారులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు ఈ కార్యక్రమములో , నాయకులు భీమోని యాదగిరి,పాండు,పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు రెడ్డమోనివెంకటేష్ యాదవ్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అఖిల్ ఖాన్, ప్రధాన కార్యదర్శి జగన్, కార్యదర్శి విజయ్, తాడిపర్తి సర్పంచ్ దూస రమేష్,గ్రామకిసాన్ శాఖ అధ్యక్షులు కడారి సోమయ్య, మోటకోని జంగయ్య.అనమోని లక్ష్మయ్య
కుందారపు జంగయ్య, జంగారెడ్డి, చీర శేఖర్ తదితరులు పాల్గొన్నారు
Attachments area