చిన్నోడి చికిత్సకు సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ఆర్థిక సాయం

గద్వాల నడిగడ్డ, నవంబర్ 9 (జనం సాక్షి);
అభము శుభము తెలియని చిన్నోడికి పెద్ద రోగం వచ్చింది ఆ భాగ్యానికి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ఆ చిన్నోడికి 35 వేల రూపాయల నగదు బుధవారము ఆర్థిక సాయం అందజేశారు.గద్వాల పట్టణానికి చెందిన రెక్కాడితే గాని డొక్కాడని కార్పెంటర్ జగదీష్ చారీ కుమారుడు 2 సంవత్సరముల మాన్విత్ కి ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయి, రెండవ కిడ్నీ కూడా సరైన ప్లేస్ లో లేక తీవ్రమైన మూత్ర సంబధిత వ్యాధి తో బాధపడుతున్నాడని, డాక్టర్ లు డ్యామేజ్ అయినా కిడ్నీ తీసివేసి రెండవ కిడ్నీ కూడా ఆపరేషన్ చేసి సరి చేయాలని చెప్పరని, దీనికి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని సోషల్ రెస్పన్సిబిలిటీ టీమ్ సంప్రదించడం తో వారికి టీమ్ నుండి 35,000/- రూపాయలు నగదును అందజేయడం జరిగిందని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్, తిరుమలేష్, యుగంధర్ రెడ్డి, శ్రీరాములు, భీమేశ్వర్,చందు, సంజీవ్, నాగేష్ ,నాగరాజు ,సంధ్య అశోక్ పాల్గొన్నారు.