చీనాబ్ నదిలో మినీ బస్సు బోల్తా: 11మంది మృతి
శ్రీనగర్,సెప్టెంబర్14(జనంసాక్షి): జమ్మూకశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవరాం ఉదయం 9:55 గంటలకు ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను బయటకు వెలికితీశామని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.