చెక్ పడాల్సిందే..

రాయికల్,అక్టోబర్ 13(జనంసాక్షి) ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు,వస్తువులు, ఆభరణాలు కానీ తిస్కవెళ్ళే అవకాశం లేదు. తనిఖీల్లో పట్టుపడితే సరైన ఆధారాలు చూపిస్తే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు,ఆధారాలు లేకపోతే ఆలాంటి సొమ్మును సీజ్ చేసి ఆదాయపు శాఖకు సమాచారం అందిస్తారు.కోడ్ ముగిసేంత వరకు నిబంధనలు పాటించకపోతే ఎంతటి వారికైనా చెక్ పడాల్సిందే అని రాయికల్ మండల ఎస్సై అజయ్ తెలియజేశారు.