చెన్నమనేని భారత పౌరుడు కాదు
– కేంద్ర హోంశాఖ
-మోసపూరితంగా పౌరసత్వం పొందారని వెల్లడి
– హైకోర్టులో సవాలు చేస్తా: చెన్నమనేని రమేష్
న్యూఢిల్లీ,నవంబర్ 20(జనంసాక్షి): టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు కేంద్ర ¬ంశాఖ గట్టి షాకిచ్చింది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. దీంతో పౌరసత్వం విషయంలో టీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దయింది. ఈ మేరకు కేంద్ర ¬ంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర ¬ంశాఖ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ¬ంశాఖ మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ¬ంశాఖ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర ¬ంశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర ¬ంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్కు సూచనలు చేసింది. దీనిపై పునఃసవిూక్ష జరిపిన కేంద్ర ¬ంశాఖ చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని పొందారని తేల్చింది. అనేక వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్థారించింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ¬ంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన జర్మనీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తుండటంతో ద్వంద్వ పౌరసత్వం అంశం తెరపైకి వచ్చింది. రమేష్ పౌరసత్వం విూద వివాదం ఉన్న విషయం విదితమే. ఆయన 1993 లో జర్మనీకి వలసవెళ్లారు. జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించారు. ఆ తర్వాత 2009లో భారత్కు తిరిగి వచ్చారు. మళ్లీ భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. మూడుసార్లు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన చెన్నమనేని రమేష్ పౌరసత్వం విూద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆది శ్రీనివాస్ అనే నాయకుడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ వివాదం కేంద్ర ¬ంశాఖ వద్దకు వచ్చింది. దీనిపై 2017 లోనే ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ¬ంశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే, చెన్నమనేని రమేష్ దీనిపై రివ్యూ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేసి త్వరగా నిర్ణయం ప్రకటించాలని ఇటీవల కేందకర ¬ంశాఖను ఆదేశించింది.