చెన్నైలో ‘వార్ధా’ బీబత్సమ్
వార్ధా తుపాన్తో అతలాకుతలమైన తమిళనాడులో ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారుల్లో కూడా నడుము లోతు నీళ్లు నిలిచిపోయాయి. సబ్ అర్బన్ రైళ్లను నిలిపివేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ ప్రసారాన్ని ఆపివేశారు. అతి వేగంగా వీస్తున్న గాలులతో చెట్లు, లైటు స్తంభాలు కూలిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాన్ తాకిడికి గురై పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి అమ్మ కేంటీన్ల ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్నారు.