చేగుంటలో పలు ఇళ్లలో చోరీ
చేగుంట: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు రెచ్చి పోయారు. తాళాలు వేసి పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చొరబడి ఐదున్నర తులాల బంగారం, 12 వేల నగదును దోచుకెళ్లారు. దీంతో పాటు పలువురి ఇళ్లలో భారీగా బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.