చైనాలో భారీ భూకంపం

బీజింగ్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి):
చైనాలో భారీ భూకంపం సంభ వించింది. భూక పం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతల మయ్యాయి. ఈ సంఘటనలో 65 మంది దుర్మరణం చెందారు. 750 మంది తీవ్రంగా గాయపడగా , 20 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.6గా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.