చౌదర్ పల్లి లో ఘనంగా మిలాద్ ఉన్ నబి పండుగ

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 9 (జనం సాక్షి): యాచారం మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి షమీం మసీద్ కమిటీ మెంబర్స్ ఘనంగా మిలాద్ ఉన్ నబి పండుగను జరుపుకోవడం జరిగింది. అల్లా ఆశీర్వాదంతో గ్రామాలలోని చెరువుల కుంటలు నిండాయని ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ముస్లిం యువకులు పాల్గొన్నారు.