జడ్చర్లలో భారీ అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జడ్చర్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాస్స్‌పార్మర్లను నిలువ చేసే కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సుమారు మూడు వందల ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.