జడ్పీటీసీ గీకురు సతీమణిని పరామర్శించిన తెరాస నాయకులు

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 13:
చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ సతీమణి కావ్య అనారోగ్యముతో భాదపడుతూ హైద్రాబాద్ లోని బస్వతారకం హాస్పిటల్లో చికిత్స పొందుతుతున్నారు. మండల తెరాస నాయకులు మంగళవారం హాస్పిటల్ కు వెళ్లి ఆమెని పరామర్శించారు. త్వరలోనే ఆరోగ్యం కుదుట పడుతుందని ఆశిస్తూ, జడ్పీటీసీ ఆయన సతీమణిని మనో ధైర్యంతో ఉండాలన్నారు.
ఈకార్యక్రమములో పాక్స్ చైర్మన్ జంగా వెంకట రమణ రెడ్డి, తెరాస జిల్లా సీనియర్ నాయకులు పన్యాల శ్యాముసుందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా రైతు బంధు సమితి సభ్యులు సాంబారి కొమురయ్య, తెరాస మాజీ మండల పార్టీ అధ్యక్షులు రామోజు కృష్ణమా చారి, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ లు పాల్గొన్నారు.