జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

బచ్చన్నపేట( జనం సాక్షి) అక్టోబర్ 10
జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని నియోజకవర్గ కోఆర్డినేటర్ జంగిటి నరేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం జనగామ ప్రజలను అమాయకత్వాన్ని చూసి అబద్ధపు హామీలతో మసి పూసి మారడికాయ చేద్దామని చూస్తుందని కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించనీకి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎందుకంటే గతంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన అవినీతిని ప్రజలు గమనించారని దానికి నిదర్శనమే కెసిఆర్ ముత్తిరెడ్డి కాదు నా ముఖం చూసి ఓట్లు వేయాలని అనడమే అని అన్నారు. అయినా కూడా కేసీఆర్ మాటలు విని జనగామ లో ముత్తిరెడ్డిని రెండవసారి గెలిపించారని ఇప్పుడు ముత్తిరెడ్డి కి టికెటు ఇవ్వక పోవడం ప్రజలకు అర్థమయింద నీ అప్పటి నుండే జనగామ అభివృద్ధికి దూరమై భూకబ్జాలకు దగ్గర అయిందని కానీ ఇప్పుడు ప్రజలు చైతన్యవంతమైనారని జనగామ ప్రజలు నీతికి నిజాయితీకి నిదర్శనమని అందుకనే ముత్తిరెడ్డిని కాదని పళ్ళ రాజేశ్వర్ రెడ్డిని ముందుకు తీసుకువస్తే ఓట్లు వేయనీకి వారికి బానిసలం కాదని దేశ రాష్ట్ర జిల్లా అభివృద్ధి ముఖ్యమని అందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు సూత్రాలతో మేనిఫెస్టోను కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి తీసుకొని పోయి జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరేసి చూపిస్తామని అన్నారు