జనవరి 16 నుంచి స్టార్టప్ ఇండియా

55

వచ్చే ఏడాది జనవరి 16 నుంచి స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ లో మాట్లాడిన ఆయన.. దేశ ప్రజలకు క్రిస్ మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పర్యాటక ప్రదేశాల్లో అపరిశుభ్రత పేరుకుపోతుందని, స్వచ్ఛ భారత్‌ను పాటిస్తూ పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. దేశంలో గ్రామాలన్నింటినీ విద్యుదీకరించాలనే సంకల్పంతో తాము పని చేస్తున్నామన్నారు ప్రధాని. స్టార్టప్‌లను యువతకు, యూనివర్సిటీలకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.