జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, అక్టోబర్17,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో సోమవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల కోరిక మేరకు ఈ రోజు 131 వ సారి అన్నదాన కార్యక్రమం దాత బింగి హర్షిత్ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు బింగి లలిత – సత్యనారాయణ దంపతులు, నానమ్మ, తాతయ్య బింగి లింగమ్మ – మల్లయ్య దంపతుల ఆధ్వర్యంలో యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, కోశాధికారి కోడిపెళ్లి గిరి ప్రసాద్, సహాయ కార్యదర్శి పతంగి సంతోష్, సభ్యులు లక్కాకుల శ్రీనివాస్, పాయవేణి మల్లేష్, బొలిశెట్టి సుధాకర్, బియ్యల అంజయ్య, నిచ్చకోలా గురుస్వామి పాల్గొన్నారు.