జనావాసాల్లో చెత్త తొలగింపులో నిర్‌క్ష్యం: బోండా

విజయవాడ,నవంబర్‌6 (జనంసాక్షి):   జనావాసాల్లో చెత్త నిల్వపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో డంపింగ్‌ యార్డులోని 2.5 లక్షల టన్నుల చెత్తను.. శాస్త్రీయ పద్ధతిలో తొలగించామని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ చెత్త సమస్య ఉత్పన్నమైందన్నారు. మంత్రి బొత్స, ఎమ్మెల్యే విష్ణుకు ప్రజల కష్టాలపై పట్టింపు లేదన్నారు. 24 గంటలు సింగినగర్‌లో ఉంటే ప్రజల బాధలు అర్ధమవుతాయన్నారు. చెత్త డంపింగ్‌ నిలిపివేసి.. ట్రాన్స్‌ఫార్మర్‌ స్టేషన్‌ను తరలించాలని బోండా ఉమ పేర్కొన్నారు.