జమ్మలమడుగులో నాటుబాంబుల స్వాధీనం

కడప,జులై24(జ‌నంసాక్షి):  రాయలసీమలో నాటు బాంబులు బయటపడ్డాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు పట్టణానికి సవిూపంలో 54 నాటు బాంబులు లభ్యమయ్యాయి. ముద్దనూరు రోడ్డులో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కోసం భూమిని చదును చేస్తుండగా ఓ బకెట్‌ బయటపడింది. దీంట్లో నాటు బాంబులు ఉండడాన్ని గమనించిన జేసీబీ, ట్రాక్టర్‌ డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపించారు. మొత్తంగా నాలుగు బకెట్లలో 54 నాటు బాంబులు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ నాటు బాంబులు 20 ఏళ్ల క్రితం పాతిపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేస్తున్న యజమానిని ప్రశ్నించే అవకాశం ఉంది.