జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

3

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుప్వారా జిల్లాలోని ఆర్మీ క్యాంప్‌ పై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన నలుగురైదుగురు ఉగ్రవాదులు గ్రెనేడ్లు, తుపాకులతో విరుచుకుపడ్డారు. దాడిలో ఒక బీఎస్సెఫ్ జవాన్ మృతిచెందాడు. వెంటనే జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో ఉగ్రవాదులు తప్పించుకున్నారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.