జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఎన్నికలు?

CNN_INDIA_MAP.gifజమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ కోర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం సాయంత్రంలోగా స్పష్టత ఇవ్వాలని గవర్నర్ అల్టిమేటమ్ జారీ చేయడంతో.. మెహబూబా ముఫ్తీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాయంత్రం బీజేపీ నేతలు గవర్నర్ వోహ్రాను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.