జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల హతం

97dykjgaహైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదులు స్థానిక గుస్సు గ్రామంలో సంచరిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు చనిపోయారు. వీరిలో ఒకరిని విదేశీయునిగా గుర్తించారు.