జయలలిత ఎస్టేట్‌ సెక్యూరిటీ గార్డు హత్య

చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన టీ ఎస్టేట్‌ సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. కోటగిరికి సమీపంలో జయలలితకు చెందిన కోదనాడ్‌ ఎస్టేట్‌ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓం బహదూర్‌(51) అనే వ్యక్తిని సోమవారం తెల్లవారుజామున 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. అదే సమయంలో కృష్ణా బహదూర్‌ అనే మరో వాచ్‌మెన్‌ వారిని అదుపుచేయడానికి యత్నించగా అతనిపై దాడి చేసి పరారయ్యారు. క్షతగాత్రుడు కృష్ణా బహదూర్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కొద్దిరోజుల క్రితం జయలలితకు చెందిన సిరుతవూర్‌ బంగ్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది బంగ్లాను శుభ్రం చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఈ ఘటన చోటుచేసుకుంది.