జయ లలితపై విషప్రయోగం…???

 jayalalithaa-with-sasikala-295న్నాడీఎంకే అధినేత్రి జయ లలితపై శశికళ, ఆమె బృందం కలిసి విషప్రయోగం చేశారని అన్నాడీఎంకే సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్‌.కృష్ణమూర్తి ఆరోపించారు. ఈ ఆరోపణలున్న ఆడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. విషప్రయోగం వల్లనే జయ మృతి చెందారని ఆయన ఆరోపించారు. అంతేగాక జయ ఆస్తులను కాజేసేందుకు శశికళ ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ వాటిని అన్యా క్రాంతం కాకుండా సుప్రీం కోర్టులో దావా వేయనున్నట్లు చెప్పారు. శశికళ మర్యాదగా పోయస్‌గార్డెన్ ఇంటిని వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఒక కేసు నిమిత్తం శుక్రవారం కోయంబత్తూరుకు వచ్చిన కృష్ణమూర్తిని అన్నాడీఎంకేకు చెందిన న్యాయవాదులు చుట్టుముట్టారు. ‘అన్నాడీఎంకే గురించి మాట్లాడేందుకు నీవెవరు? నీ∙ఆరోపణలను నువ్వే  ఖండించు..  న్యాయవాది యూనిఫాం విప్పు.. నీ సంగతి చూస్తాం’ అంటూ వారు బెదిరించారు.