జాట్ ఆందోళన : రవాణాకు అంతరాయం

ea8d60foహర్యానా : హర్యానాలో జాట్ వర్గీయుల ఆందోళన కొనసాగుతుంది. జాట్‌ల ఆందోళనల నేపథ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెయ్యి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్‌వో నీరజ్ శర్మ ప్రకటించారు. మరో 700 రైళ్లు రద్దీ అయినట్లు వెల్లడించారు. రైళ్ల రద్దు వల్ల ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాట్ వర్గీయులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. జాట్ ఆందోళనల క్రమంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.