జాతిపితకు ప్రధాని నివాళి

stdb58glజాతిపిత మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా దేశంయావత్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌ దగ్గర పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీతో పాటు పలువురు మంత్రులు, నాయకులు బాపూకు నివాళి అర్పించారు. మహాత్ముని సేవలను స్మరించుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.