జాతీయ కరాటే టోర్నీలో షిటోరియు కరాటే విద్యార్థుల ప్రతిభ

మంథని, (జనంసాక్షి ) : కరీంనగర్ లోని బిఆర్ అంబేద్కర్ స్టేడయంలో శుక్రవారం జరిగిన జాతీయ కరాటే పోటీల్లో శిక్షకులు కాయి రాష్ట్ర స్పోర్ట్ కమిషన్ కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్ షటోరియో కరాటే అకాడమీ విద్యార్థులు సబ్ జూనియర్స్ కథ,కుమితి విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు వెండి, కాంస్య పథకాలు సాధించారు. పథకాలు సాధించిన వారిలో ఎండి తైభ ఎండి ఈక్ర ఆర్ విశాలి, ఆర్ వైష్ణవి, కే అశ్విని బాబు, బి.అక్షయ కీర్తన లు పథకాలు సాధించారు. పథకాలు సాధించిన వారిని జపాన్ షెటోరియు కరాటే రాష్ట్ర అధ్యక్షులు కాయ్ రిఫ్రి కమిషన్ చైర్మన్ పి పాపయ్య ప్రధాన కార్యదర్శి ఆర్ సంతోష్ ఇన్స్ట్రక్టర్ మెట్టు హాసిని లు అభినందించారు.

తాజావార్తలు