జాతీయ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ జోడో యాత్ర.

-ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్.


గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 31 (జనం సాక్షి);
జాతీయ సమైక్యత కొరకు రాహుల్ గాంధీ జూడో యాత్ర ప్రారంభించినట్లు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు.ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారము రాహుల్ జోడో యాత్రలో షాద్ నగర్ లో పాల్గొన్న ఎన్ ఎస్ యూ ఐ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ విద్వేష, విష, విమర్శల విధ్వంసాలతో విచ్చిన్నం నుండి విడుదల కోసం వేసిన అడుగే భారత్ జోడో యాత్ర అని తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న రాహుల్ యాత్రకు ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని, దేశ సమగ్రతను కాపాడే కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని,యువకులు,పెద్దలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారని, వారి యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, రాష్ట్రంలోనే కాదు దేశంలో నలుమూలల కాంగ్రెస్ పవనాలు విస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ యూ ఐ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.