జియో మరో బంపర్ ఆఫర్.??

 వెల్‌కమ్ ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు జియో అప్పట్లో ప్రకటించింది. అయితే అసలు జియో ఈ ఆఫర్‌ను పొడిగించడానికి కారణమేంటి? అన్ని నెలలు ఉచితంగా ఫ్రీ డేటా, ఫ్రీ కాలింగ్ సదుపాయాన్ని వినియోగదారులకు ఎలా అందించగలుగుతుంది? అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేసే లోపే ‘జియో’ నుంచి మరో ambani_660_040513054025సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ గడువు ఇంకో నెలలో ముగుస్తుందనుకుంటున్న నేపథ్యంలో.. ఈ ఆఫర్‌ను ఏకంగా ఏడాది పాటు పొడిగించే యోచనలో జియో ఉందని పలు వెబ్‌సైట్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఈ ఆఫర్ పొడిగింపు ప్రకటన ఉంటుందని కొంతమంది అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడున్న ఉచిత సర్వీస్‌తో పాటు వెల్‌కమ్ ఆఫర్ కూడా 2017 సంవత్సరం చివరి వరకు ఉంటుందని అంటున్నారు. ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా ఇటీవల ఓ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం రూ.149 రీచార్జ్‌తో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేసుకోవడంతో పాటు ఉచితంగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కాం ప్రకటించింది. ‘జియో’ ఆఫర్ కేవలం 4జీ వినియోగదారులకు మాత్రమే. అయితే ఆర్‌కాం ఆఫర్‌ను 2జీ, 3జీ, 4జీ వినియోగదారులందరూ వాడుకోవచ్చు. తాజా ఆఫర్‌ దేశంలో మొబైల్ రీచార్జ్‌లో విప్లవం వంటిదని ఆర్‌కామ్ సీఈవో గురుదీప్ సింగ్ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్న విషయం కూడా విధితమే.