జియో ల్యాప్ టాప్ వచ్చేస్తోంది

మొన్నఉచిత డేటా…నిన్న తక్కువ ధరకే సెటాప్ బాక్స్ లు విడుదల చేసిన జియో..తాజాగా 13.3 ఇంచెస్  ల్యాప్ టాప్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ ల్యాప్ టాప్ లో జియో సిమ్‌లను వేసుకునే విధంగా రూపొందినట్టుగా తెలుస్తోంది.

జియో తీసుకురానున్న ల్యాప్‌టాప్ ఫీచర్లు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 13.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, విండోస్/క్రోమ్ ఓఎస్/ఆండ్రాయిడ్ ఓఎస్, హెచ్‌డీ వెబ్ కెమెరా, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ హార్డ్ డిస్క్, 10 గంటల బ్యాటరీ లైఫ్ వచ్చేలా జియో కొత్త ల్యాప్‌టాప్‌ ఉండనుంది. ఈ విషయంపై ఇప్పటికే చైనాకు చెందిన కొన్ని ల్యాప్‌టాప్ తయారీ సంస్థలతో జియో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ల్యాప్‌టాప్‌లను రూ.20వేల నుంచి రూ.40వేల మధ్య ధర ఉండే అవకాశముంది.