జియో సరికొత్త ఆఫర్..!!

సాధ్యమైనంత త్వరగా పదికోట్ల మంది వినియోగదారులను జియో పరిథిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ… తాజాగా మరో బంపరాఫర్‌తో ముందుకొచ్చారు. కేవలం 1000 రూపాయలకే అపరిమిత వాయిస్, వీreliance-jio-4g-preview-offerడియో కాలింగ్ సదుపాయంతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ అందించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. కేవలం కాల్స్ కోసమే ఫోన్లను వినియోగించే గ్రామీణ, టైర్-III మార్కెట్లలోని వినియోగదారుల మనసు గెలుచుకునేందుకే ఎల్‌టీఈ (వోల్ట్) టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు. ప్రత్యేకించి మొదటిసారి డేటా వినియోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కొత్త ఫోన్లు రూపొందించినట్టు రిలయన్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.