జిల్లా మహాసభను జయప్రదం చేయాలి

నేడు హుజూర్ నగర్ పట్టణ సమీపంలోని శ్రీకౌండిన్య ఫంక్షన్ హాల్ లో జరిగే టియూడబ్ల్యూజె ఐజెయూ ద్వితీయ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు , అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.శనివారం జిల్లా కేంద్రంలో మహాసభకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించి మాట్లాడారు.జర్నలిస్టుల సమస్యల పట్ల నిరంతరం పోరాడే సంఘం ఐజేయూ అని అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ ఈ మహాసభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బంటు కృష్ణ , గుడిపూడి రామకృష్ణ , రెబ్బ విజయ్ కుమార్ , మధు, మల్లిఖార్జున్ , అమృనాయక్ , రామకృష్ణ , మల్లేష్ , భద్రయ్య, శ్రీనివాసరెడ్డి, రవియాదవ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.