జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలను విజయవంతం చేయండి

– నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ

గద్వాల ప్రతినిధి నవంబర్ 09 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలను ఈ నెల 17 వ తేది న జిల్లా కేంద్రం లోని గర్ల్స్ హైస్కూల్ లో నిర్వహిస్తున్నారు .మండల స్థాయి లో ఈ నెల 16 వ తేదీన జిల్లా స్థాయి లో 17 వ తేదీన నిర్వహిస్తున్నారు.ఉపన్యాస అంశం భారతదేశం లో పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు తీరు మరియు స్పీకర్ తిరు తెన్నులు అనే అంశం పై ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు పాల్గొనాలని ఈ నెల 16 వ తేది న గట్టు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరుగుతుందని నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ ఒక ప్రకటన లో తెలిపారు..ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓబులేసు పాఠశాల ఉపాధ్యాయులు శివశంకర్, శివ ప్రసాద్, పరుశరామ్, నర్సింహులు గౌడ్, రాజుసాగర్ తదితరులు పాల్గొన్నారు..