జూలపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ

కమాన్‌పూర్, జనంసాక్షి, అక్టోబర్ 07 : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో మల్లిఖార్జున నగర్ లో గల పెద్దమ్మ తల్లి అలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోని హుండిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి రూ.20 వేలు చోరీ చేశారు. హుండిని కొద్ది దూరంలో పడేశారు. ఉదయం గ్రామస్తులు గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు కమాన్‌పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.