జైబున్నీసాకు మరో 4వారాల గడువు

న్యూఢీల్లీ, జనంసాక్షి: 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష పడిన జైలున్నీసాతో సహా నలుగురికి లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువిచ్చింది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఇచ్చిన గడువును కూడా ధర్మాసనం నాలుగు వారాలు పొడిగించిన సంగతి తెలిసిందే.