టిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 07 : వైరల్ ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కన్నాల మాజీ సింగిల్ విండో చైర్మన్ మల్క రామస్వామి ని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ శనివారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇనుగంటి రామారావు, పిట్ల గోపాల్ తదితరులు ఉన్నారు.