టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరికలు .
మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 18 (జనం సాక్షి) టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి వెల్లడించారు ఆదివారం మండల కేంద్రంలోని జక్కేపల్లి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బిజెపి కాంగ్రెస్ యువకులు జె నాగరాజు , రాజు, లాలప్ప వెంకటప్ప, మల్కప్ప, శ్రీకాంత్ చిన్న లాలప్ప సాయిలు వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షితులై
పార్టీలో చేయడం జరుగుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు టిఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పటేల్ రెడ్డి, రఘు రెడ్డి ,కృష్ణ కుమార్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area