టిఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ల్ లో చేరికలు…

భువనగిరి టౌన్ జనం సాక్షి:–భువనగిరి పట్టణంలోని స్థానిక 31వ వార్డుకు చెందినబానోతు లక్ష్మీబాయి 50 మంది కార్యకర్తలతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గతంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి పదవిలో లేకున్నా ప్రజలకు చేస్తున్న సేవలను చూసి ఆకర్షితులై ఆయన జనాదరణ పొందిన నాయకుడని భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి ఎం డి మజహార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ రషీద్ హుస్సేన్ ఎండి ఆబిద్ అలీ ఎండి ఎజాజ్ ఎండి అబ్బాస్ వినయ్ రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.