టిఆర్‌ఎస్‌ మంచి పనులతో విపక్షాల్లో ఆందోళన

విపక్షాల విమర్శల్లో అర్థం లేదు: గోపగాని

సూర్యాపేట,జూలై15(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ చేస్తున్నమంచి పనులతో ప్రతిపక్షాలు పూర్తిస్థాయి ఆదరణ కోల్పోతాయనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ నారాయణ న్నారు. తెలంగాణలో ప్రతిపక్షపార్టీలకు అధికారం కలగానే మిగిలిపోనుందని అన్నారు. కాంగ్రెస్‌ కనుచూపు మేరలో కూడా లేకపోగా, బీజేపీకి తెలంగాణలో అడ్రస్సే లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని మరో 20ఏళ్లపాటు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి కేసీఆరే సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు భ్రమలో ఉన్నాయని కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో సీఎం కేసీఆర్‌ ఎలాగైతే
చైతన్యం తెచ్చారో రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా కేసీఆర్‌ ప్రజలను సంక్షేమ పథకాలతో ఆకర్షితులను చేస్తున్నారని అన్నారు. కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ, మిష న్‌ కాకతీయ వంటి పథకాలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 నియోజకవర్గాలలో బీసీ గురుకులాలను, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు.