టిడిపిజెండాలు పట్టుకున్నారని దాడి

పోలీసుల ఎదుటే వైసిపి వారు దాగి చేశారు: జివి
గుంటూరు,మార్చి9(జనం సాక్షి): టీడీపీ జెండాలు పట్టుకున్నారని పోలీసుల ఎదుటే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజియులు ఆరోపించారు. వాళ్ళే దాడి చేసి తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. తప్పుడు కేసులు పెట్టించినందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. అధికారం ఉందని దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టించడం చేస్తే అవే విూకు సమాధి కడతాయన్నారు. రెచ్చగొట్టడం నీచ సంస్కృతి అన్నారు. తన విూద కక్ష ఉంటే తనతోనే తేల్చుకోవాలని… కార్యకర్తల జోలికి వెళ్ళ వద్దన్నారు. అయితే తిరుణాళ్లలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతూ… యువకులను రెచ్చగొడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. రాత్రి బొగ్గరం తిరుణాళ్ళలో పోలీసులపై, తన కారుపై రాళ్ళు వేశారన్నారు. జీవి మాటలు విని అమాయకులు బలి కావద్దని సూచించారు. తనపై కక్ష ఉంటే తనతో తేల్చుకోవాలని.. అమాయకుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు.