టిడిపి కార్యాలయ ఉద్యోగి వల్లూరి మృతి

చంద్రబాబు,అచ్చన్న సంతాపం
అమరావతి,మార్చి2(జనం సాక్షి): టీడీపీ కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ కన్వీనర్‌ వల్లూరి కుమారస్వామి(49) కన్నుమూశారు. గుండె పోటుతో బుధవారం ఉదయం కుమారస్వామి తుదిశ్వాస విడిచారు. కుమారస్వామి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భార్రతి వ్యక్తం చేశారు. రోజూ పార్టీ కార్యాలయంలో కలిసే వల్లూరి అకాల మరణం షాక్‌కు గురిచేసిందన్నారు. పార్టీ పరంగా కుమార స్వామి కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వల్లూరి కుమారస్వామి మృతి పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భార్రతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో రోజూ తన విధులు సమర్థంగా నిర్వర్తించే కుమారి స్వామి గుండెపోటుతో మరణించడం కలచివేసిందన్నారు. పార్టీ కోసం నిత్య సైనికుడిలా ఆయన పనిచేశారన్నారు. కుమారస్వామి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుమారస్వామి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు