టిపిసిసి డెలిగేట్ సభ్యులుగా వెంకటరామిరెడ్డి, కూనీపూర్ రాజారెడ్డి.

బాన్సువాడ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి):
బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన అడ్వకేట్ వెంకటరామిరెడ్డి, కూనిపూర్ రాజారెడ్డి లను టిపిసిసి డెలిగేట్ సభ్యులుగా మంగళవారం రోజున నియామకమయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ సభ్యులుగా నియామకమైన వెంకటరామిరెడ్డి, రాజారెడ్డి మాట్లాడుతూ డెలిగేట్ సభ్యులుగా నియమించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ,టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం టాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జహిరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావు, మహేష్ కుమార్ గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రానున్న ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంగా నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తామని  వారన్నారు.