టీబిజికేఎస్ నామినేషన్ ——————————————–

సింగరేణి లో ఈ నెల 28 న జరుగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో పోటీకి శనివారం అధికార బిఆరెస్ అనుబంధ టీబిజికేఎస్ నేతలు నామినేషన్ వేశారు. యూనియన్ అధ్యక్షులు బి. వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు నామినేషన్ పత్రాలను ఆర్ఎల్సి సాహుకు హైదరాబాద్ లో అయన కార్యాలయం లో అందచేశారు. ఎన్నికల్లో తమ యూనియన్ గెలుపు ఖాయమని, కార్మికులకు అన్ని రకాలుగా సీఎం కెసిఆర్ ఆశీర్వాదం తో, గౌరవ అధ్యక్షులు కె. కవిత నేత్రుత్త్వంలో ఎంతో మేలు జరిగింది అని నాయకులు పేర్కొన్నారు.