ట్రాక్టర్‌పై వచ్చిన ఎంపి దుష్యంత్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ పార్టీకి చెందిన ఎంపీ దుశ్యంత్‌ చౌతాలా ఇవాళ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు. ఆకుపచ్చ రంగులో ఉన్న ట్రాక్టర్‌పై ఆయన పార్లమెంట్‌కు చేరుకున్నారు. అయితే గేటు వద్దే ఆయన వాహనాన్ని ఆపేశారు. శుక్రవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొంత మంది అనుచరులతో ఆయన ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. హర్యానా మాజీ సీఎం ఓమ్‌ ప్రకాశ్‌ చౌతాలా మనువడే దుశ్యంత్‌ చౌతాలా. మాజీ ప్రధాని దేవిలాల్‌కు కూడా దుశ్యంత్‌ ముని మనవడు అవుతాడు. పార్లమెంట్‌ చరిత్రలో అత్యంత పిన్న వయసు కలిగిన ఎంపీ కూడా దుశ్యంత్‌ కావడం విశేషం.