ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌ : జడ్చర్లలోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో మొత్తం 300 ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధమయ్యాయి.