ట్రిపుల్ త‌లాక్‌ను రాజ‌కీయంగా చూడొద్దు

ట్రిపుల్ త‌లాక్ అంశాన్ని రాజ‌కీయ కోణంలో చూడ‌రాదని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. బ‌స‌వ జ‌యంతి సంద‌ర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ముస్లిం మ‌హిళ‌ల‌కు కూడా స‌మాన హ‌క్కులు క‌ల్పించాల‌న్నారు. ట్రిపుల్ త‌లాక్ లాంటి చెడు ప‌ద్ధ‌తుల నుంచి మ‌హిళ‌ల‌ను కాపాడుకునే సంస్క‌ర‌ణ‌ల‌కు ముస్లిం మ‌త‌పెద్ద‌లు దారులు వెతుకుతార‌న్న అశాభావాన్ని కూడా ప్ర‌ధాని వ్య‌క్తం చేశారు. బసవ బోధనలను సంగ్రహించాలని మోడీ ఈ సందర్భంగా సూచించారు. అహింస, సత్యాగ్రహం, సుపరిపాలన గురించి భారత్ చాలా మంచి సందేశం ఇచ్చిందన్నారు.