డిగ్రీ వార్షిక రుసుము చెల్లించాలి

భద్రాచలం : డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల వార్షిక రుసుమును ఈ నెల 5 లోగా చెల్లించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. వి. కృష్ణ , కో-అర్డినేటర్‌ కమలాకర్‌ తెలిపారు. ఈ మేరకు కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఉత్తర్వులు విడుదల చేశారని శనివారం ఓ ప్రకటనలో పేర్కోన్నారు. అపరాధ రుసుంతో నవంబరు 14 వరకు చెల్లించవచ్చన్నారు.