డెక్కంటికి రాష్ట్రీయ శిక్షారతన్‌ అవార్డు

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): భద్రాచలంలోని నన్నపనేని మోహన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న డెక్కంటి శ్రీనివాసరావుకు మరో అత్యున్నత పురస్కారం అందనుంది. ఈ నెల 31న ఢిల్లీలో నిర్వహించే జాతీయ అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించే అవకాశం శ్రీనివాసరావుకు లభించింది. ఇక్కడ ఈయనకు రాష్ట్రీయ శిక్షారతన్‌ అవార్డును ఇండియన్‌ సొసైటీపర్‌ ఇంటిలెచ్చువల్‌ డెవలప్‌మెంట్‌ అనే సంస్థ శ్రీనివాసరావుకు ఈ పురస్కారం ఇవ్వనుంది. ఈ సందర్భంగా పలువురు శ్రీనివాసరావును అభినందించారు.