డెబ్బై ఎనిమిదివ రోజుకు చేరుకున్న వీఆర్ఏల సమ్మె

రామరెడ్డి   అక్టోబర్. 10  జనంసాక్షీ  :
విజయ వంతంమైన డెబ్బై ఎనిమిదోవ రోజుకు చేరిందని వీఆర్ఏ ల మండల సంఘం అద్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. సమ్మెలో బాగంగా వారు మాట్లాడుతూ,   రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ  పిలుపు  మేరకు సోమవారం  తహశీల్దార్ కార్యాలయం దిగ్బంధం చెయ్యడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్  అసెంబ్లీలో ప్రకటించిన వీఆర్ఏల పే స్కేల్ జీవో వచ్చేంతవరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు.  రాష్ట్ర  ప్రభుత్వం తన మొండి వైఖరిని  మార్చుకుని  ఇరవై మూడు వేల వీఆర్ఏల  కుటుంబాలలో వెలుగు నింపాలని కోరారు.  ఈకార్యక్రమంలో వీఆర్ఏలు పాల్గొన్నారు.
Attachments area